37.2 C
Hyderabad
April 26, 2024 19: 11 PM
Slider ముఖ్యంశాలు

ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ నిజం కాదని మావోల ప్రకటన

#Encounter1

మంగి దళ కోయ మావోయిస్టు బాజీరావు, చొక్కాలు అనే మహిళా మావోయిస్టు లను పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని కేబీఎం కార్యదర్శి, మావోల కీలకనేత భాస్కర్ నోట్‌లో పేర్కొన్నారు. అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కొమరం భీమ్ అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి ప్రాణహిత నది తీరం వెంబడి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో  తెలంగాణ కీలకనేత భాస్కర్ తప్పించుకున్నట్లు కూడా పోలీసులు చెప్పారు.

మావోల కీలక నేత భాస్కర్ ప్రెస్‌నోట్ విడుదల

 ‘నిన్న రాత్రి, లను పోలీసులు ఇద్దరు మావోయిస్టులను పట్టుకుని చంపారని భాస్కర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణచివేతకు ఈ ఎన్‌కౌంటర్ ఉదాహరణ అని ఆయన అన్నారు. అరెస్టు చేయాల్సిన పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదని, టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

Related posts

విశాఖ ఆసుపత్రిలో కన్నీళ్లు తెప్పించే ఘోరం

Satyam NEWS

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతూ భావితరాలకు బంగారు బాట

Satyam NEWS

ఇప్పటికైనా రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టండి

Satyam NEWS

Leave a Comment