తీవ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి తీర ప్రాంత గ్రామాల లో ఏదైనా ఒక చోట వారితో పాటు తెచ్చుకున్న పేలుడు పదార్థాలను అమర్చడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే కొత్త వ్యక్తులు, కొత్త బోట్లు సముద్రంలో గాని తీరప్రాంత గ్రామాల్లో తారసపడినప్పుడు సమాచారాన్ని ఏ విధంగా అందించాలి అనే అంశం మీద మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు సాగర్ కవచ్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
అవనిగడ్డ SDPO మహబూబ్ బాషా, పాలకాయ తిప్ప మెరైన్ సిఐ వల్లభనేని పవన్ కిషోర్ ఆధ్వర్యంలో తీరప్రాంత గ్రామాలైన ఉల్లిపాలెం, హంసలదీవి, పాలకాయతిప్ప, బసవానిపాలెంలలో సాగర్ కవచ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం 150 మంది పోలీసు సిబ్బంది తో ఈ డ్రిల్ నిర్వహించారు. ప్రతియేటా కోస్ట్ గార్డ్ సిబ్బంది మరియు మెరైన్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బందితో కలిసి సంయుక్తంగా ఈ మాకు డ్రిల్ ను నిర్వహించడం జరుగుతున్నది.