సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కు నూతనంగా నియామకం అయిన మెళ్ళచెర్వు మండల కేంద్రానికి చెందిన కమిటీ సభ్యులు పోలె శంభయ్య, అన్నెం శంభిరెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డిని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇమ్రాన్, బాలవెంకట్ రెడ్డి, బచ్చు శ్రీను, ముక్తేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.