మన దేశంలో ఆడపిల్లలకు యుక్త వయసు రాకముందు నుంచే తల్లిదండ్రులు వారి పెళ్లి గురించి బెంగ పెట్టుకోవడమనేది సహజంగా వస్తున్నదే.
ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్ ఇప్పుడు ఆ సంఖ్యను 18 నుంచి 21 కి పెంచాలని యోచిస్తొందట.
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొంతమంది బాలికలకు రాసిన ఒక లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.” ఆడపిల్ల పెళ్లికి సరైన వయసు నిర్ధారించడానికి నిర్ణయిచడానికి మేం సిద్ధంగా ఉన్నాం..ఈ విషయమై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.
ఇందుకు ఒక కమిటీని వేసాం. రిపోర్టు ఇస్తాం అని చెప్పాం. అయితే ఎంత వ్యవధిలోగా నిర్ణయం తీసుకుంటారని ఆడబిడ్డలు అడుగుతున్నారు.
నివేదిక రాగానే అధ్యయనం చేసి సిఫార్సుల మేరకు అమలు చేస్తాం’ అని ప్రధాని అన్నారు.