లాక్ డౌన్ సమయంలో తాను పేదలను ఆదుకున్నానని, ఆ సమయంలో వచ్చిన రంజాన్ పండుగకు ముస్లింలకు హలీం ఉచితంగా పంచి పెట్టానని తాను ఆ సమయంలో చేసిన సాయాన్ని బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
తాను ముస్లింలకు మాత్రమే సాయం చేస్తున్నానని వారు మాట్లాడారని, అయితే ఇప్పుడు వచ్చి చూడాలని, వేలాది మంది మహిళలు వచ్చి బతుకమ్మ ఆడుతున్నారని ఆయన అన్నారు.
ఆదివారం రాత్రి మోతీ నగర్ లో జరిగి బతుకమ్మ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు కూడా పాల్గొని బతుకమ్మ ఆడారు. హిందూ ముస్లిం భేద భావన లేకుండా అన్ని పండుగలూ అందరూ జరుపుకునే విధంగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెప్పారు.
బతుకమ్మ పండుగను గత ఐదు సంవత్సరాలుగా మోతీ నగర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.