33.7 C
Hyderabad
April 29, 2024 01: 53 AM
Slider ముఖ్యంశాలు

సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూపై చెలరేగుతున్న భయాందోళన

#BirdFlue

సూర్యాపేట జిల్లాలో కోళ్లు మూకుమ్మడిగా చనిపోవడం పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నది.

సూర్యాపేట జిల్లాలోని కాసరబాద్, కేసారం, దాసాయి గూడెం, తిరుమల్ గిరి, నామవరం, దురాజ్ పల్లి గ్రామాలలో ఈ సంఘటన జరిగింది.

బర్డ్ ఫ్లూ లేదని అధికారులు చెబుతున్నా ఇలా సామూహిక మరణాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

కోళ్లు చనిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షలకు పంపామని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని కోళ్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వివరించారు. ఒకే చోట పరిమితికి మించి కోళ్లను ఉంచితే ఊపిరి ఆడక మరణించి ఉండవచ్చునని వారు తెలిపారు.

లేదా గత రెండు రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం వల్ల కూడా ప్రభావం పడి ఉండవచ్చునని అంటున్నారు.

Related posts

హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలు ప్రారంభం

Satyam NEWS

పట్టభద్రుల ఎన్నిక: ప్రజాస్వామ్యానిదే ఈ విజయం

Satyam NEWS

లాక్ డౌన్ నేపధ్యంలో కోమటిరెడ్డి క్రికెట్ మ్యాచ్

Satyam NEWS

Leave a Comment