ఆనందోత్సాహాల మధ్య తెలుగుదేశం శ్రేణులు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నిక గెలుపు పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు స్పందించారు. అశోక్ బంగ్లాలో మీడియా తో మాట్లాడుతూ ప్రజలు ఆలోచన లో మార్పు వచ్చిందన్నారు. ఎంఎల్సీ ఎన్నికల లో ఆ ఆలోచనే మార్పు నకు నాంది పలికిందన్నారు. దాని పర్యవసానమే.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల లో ఆ మార్పు జరిగిందన్నారు. ఈ మార్పు ప్రజాస్వామ్యానికే శుభపరిణామం అని అశోక్ గజపతిరాజు అన్నారు.