33.7 C
Hyderabad
April 29, 2024 00: 48 AM
Slider ముఖ్యంశాలు

ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో 27న సామూహిక నిరాహార దీక్ష

#Mudiraj JAC

ముదిరాజ్ లను BC( D )నుంచి BC( A) లోకి తక్షణమే చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ముదిరాజ్ జేఏసీ 27వ తేదీన సామూహిక నిరాహార దీక్ష చేయనున్నది. హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద జరగబోతున్న సామూహిక నిరాహార దీక్షకు ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ హాజరు కావాలని జేఏసీ కోరింది.

అన్ని సంఘాల నాయకులు జిల్లాల నాయకులు, ప్రతి గ్రామం నుండి ముదిరాజ్ సోదరులు తరలి రావాలని ఉదయం 10 గంటల నుండి ఐదు గంటల వరకు అక్కడ ఉండి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ముదిరాజ్ జాతి సత్తా ఏమిటో చూపించాలని వారన్నారు. ముదిరాజ్ ల డిమాండ్స్ తీర్చేందుకు 5000 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి గ్రామాలలో ముదిరాజులకు మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేయాలని,

సొసైటీలు ఏర్పాటు చేయాలని అనే దానిపై ఒక తీర్మానం చేసి మనం ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రతి జిల్లా నుండి కనీసం 1000 మందికి తగ్గకుండా మన ముదిరాజ్ లు రావాలని ప్రతి ఒక్కరిని కోరారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అనుమతివ్వండి

Satyam NEWS

“ఉజ్జ్వ‌ల భార‌త్ – ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్” పేరుతో విద్యుత్ ఉత్స‌వాలు

Satyam NEWS

సమన్వయంతో ఇళ్ల పట్టాల పంపిణీని విజయవంతం చేద్దాం

Satyam NEWS

Leave a Comment