కొమరం బీమ్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని భద్రకాళి దేవస్థానం వద్ద సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో 111 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన భార్య రమాదేవి పెళ్లి పెద్దలుగా వ్యవహరించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేద మంత్రోచ్ఛారణలు, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం సామూహిక వివాహాలను నిర్వహించారు.
పుర ప్రముఖులు సమక్షంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యహరించి వివాహాలు ఘనంగా జరిపించిన అనంతరం బంధువులందరికీ భోజనం ఏర్పాటు చేసి వడ్డించారు. నూతన వధూవరుల తో కలిసి భోజనం చేశారు. పెళ్లి కి కావాల్సిన మట్టెలు మంగళసూత్రం తో పాటు పట్టు బట్టలు ఇంటి సామాగ్రి బీరువా తదితరాలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు నూతన వధూవరులకు అందజేసి ఆశీర్వదించారు.
పెళ్లి పెద్దగా వ్యవహరించి తమ పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులకు వధూవరులు వారి తల్లిదండ్రులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. సహకరించిన దాతలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
సామూహిక వివాహాలకు ముఖ్యఅతిథిలుగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులు 511 పెళ్లిళ్లు చేశారు.