భారతదేశ గణిత శాస్త్ర వ్యవస్థాపకుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కొల్లాపూర్ గ్రీన్ ల్యాండ్ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ ఇ.వెంకటేష్, ప్రిన్సిపల్ డి.శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
ఈ నెల 22న శ్రీ రామానుజన్ 132వ జయంతిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని గ్రీన్ ల్యాండ్ పాఠశాలలో ఈనెల 21న 5,6,7,8 తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉదయం10 గంటలనుండి12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు యజమాన్యం వారు వెల్లడించారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యాతిధులచే ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి పాఠశాల విద్యార్థులు ఈ ప్రతిభ పరీక్షలో పాల్గొనవచ్చని చెప్పారు. విద్యార్థులు సంప్రదించవలసిన నెం93477 16888 కు ఫోను చేసి 19వతేది వరకు పూర్తి వివరాలు అందించవలసిందిగా కరస్పాండెంట్ ఇ.వెంకటేష్ కోరారు.