28.7 C
Hyderabad
April 28, 2024 06: 12 AM
Slider మహబూబ్ నగర్

21న గ్రీన్ ల్యాండ్ పాఠశాలలో గణిత ప్రతిభ పరీక్ష

భారతదేశ గణిత శాస్త్ర వ్యవస్థాపకుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కొల్లాపూర్ గ్రీన్ ల్యాండ్ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ ఇ.వెంకటేష్, ప్రిన్సిపల్ డి.శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు.

ఈ నెల 22న శ్రీ రామానుజన్ 132వ జయంతిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని గ్రీన్ ల్యాండ్ పాఠశాలలో ఈనెల 21న 5,6,7,8 తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉదయం10 గంటలనుండి12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు యజమాన్యం వారు వెల్లడించారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యాతిధులచే ప్రథమ, ద్వితీయ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి పాఠశాల విద్యార్థులు ఈ ప్రతిభ పరీక్షలో పాల్గొనవచ్చని చెప్పారు. విద్యార్థులు సంప్రదించవలసిన నెం93477 16888 కు ఫోను చేసి  19వతేది వరకు పూర్తి వివరాలు అందించవలసిందిగా కరస్పాండెంట్ ఇ.వెంకటేష్ కోరారు.

Related posts

కాలమహిమ!

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన భగత్ సింగ్ సేవా సమితి

Satyam NEWS

ఈడీ విచారణ ఎదుర్కొన్న అహ్మద్ పటేల్

Satyam NEWS

Leave a Comment