కోయ ప్రసాద్ రెడ్డి అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగలాలని బయటపెట్టేందుకు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణాలన్నీ నిజమేనని విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్ ద్వారా రుజువు అవుతుందని ఆమె అన్నారు.
ఆయన ముఖ్య అనుచరుడు కొయ్య ప్రసాద్ రెడ్డి వైజాగ్ లో 100 ఎకరాలు కబ్జాకు ప్రయత్నం చేశాడని, జగన్, విజయసాయిరెడ్డిల ప్రోద్బలంతోనే అనేక మంది వైకాపా నాయకులు వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని అనిత ఆరోపించారు. దీనిపై రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ విచారణకు ఆదేశించకపోతే పెద్ద భూకుంభకోణాల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకే తూతు మంత్రంగా ఒకరిపై చర్యలు తీసుకున్నారని భావించాల్సి వస్తుందని, కోయ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న చేప మాత్రమే ఆ చేప వెనక ఉన్న తిమింగలాలు బయటపడాలని ఆమె డిమాండ్ చేశారు.