29.7 C
Hyderabad
April 29, 2024 08: 50 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎండి అజీజ్ పాషా

#Uttamkumar Reddy

తెలంగాణ రాష్ట్ర  ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ లోకి హుజూర్ నగర్ కు చెందిన ఎండి.అజీజ్ పాషాకు స్థానం దక్కింది. ముస్లిం మైనార్టీలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో తనకు ఈ పదవి ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం హైదరాబాద్ లో  ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నియామక పత్రం కాపీని స్వీకరించిన అనంతరం అజీజ్ పాషా మాట్లాడుతూ పార్టీలో  క్రియాశీలకంగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు,  కార్యక్రమాలను నిరంతరం ఎండగడుతూ, అనేక ప్రజా సమస్యల పరిష్కారం పట్ల పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి  కృషి చేస్తున్నందుకు గాను తనను గుర్తించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2023 – 2024  సంవత్సరాలలో అసెంబ్లీ,  పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి A.I.C.C.అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టి.పి.సి.సి అధ్యక్షులు MP ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాలలో కృషి చేస్తామని తెలిపారు.

భారత దేశ ప్రధానిగా  రాహుల్ గాంధీ  కావాలని అలాగే తెలంగాణ రాష్ట్రంలో  ఉత్తమ్ కుమార్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,  ఉత్తమ్ కుమార్ రెడ్డికి  అత్యంత కీలక పదవి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related posts

చంద్రబాబుకు హాండ్ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు

Satyam NEWS

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

Satyam NEWS

తిరిగి ప్రారంభం కానున్న శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం

Satyam NEWS

Leave a Comment