జన అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో డిసెంబర్ 16,17,18 తేదీలలో కమిషన్ పర్యటించనున్నట్లు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జనత అదాలత్ పోస్టర్ను హరీష్రావు సమక్షంలో కమిషన్ చైర్మన్, సభ్యుల మధ్య ఆవిష్కరించారు.
దళిత గిరిజనుల హక్కుల పరిరక్షణకై సత్వర న్యాయం జరిగే విధంగా కమిషన్ కోర్టును జిల్లాలోనే నిర్వహించి సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. దళిత గిరిజనులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కుల సంఘాల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలి. కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని వారికి భరోసానిచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.