23.7 C
Hyderabad
May 8, 2024 03: 23 AM
Slider వరంగల్

రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

#mulugu zp chairmen

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వారి ఆధ్వర్యంలో ఈరోజు ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కుసుమ జగదీష్ మాట్లాడుతూ రక్త దానం చేయడానికి అందరూ ముందుకు రావడం శుభ పరిమాణం అని అన్నారు. రక్తదానం ప్రాణ దానం అని, యువకులు అందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో కలిసి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వారిని జడ్పీ చైర్మన్ అభినందించారు. ప్రజలకు మానవాళికి మంచి చేసే ప్రతి కార్యక్రమానికి పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తాను అని జడ్పీ చైర్మన్ తెలిపారు. రక్త దానం చేసిన వారికి సర్టిఫికేట్ లను అందజేశారు.

తొలి సారి తమ వద్దకు వచ్చిన జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు వారు శాలువా తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, సుంకోజు ద్రోణాచారి, వేల్పుల దేవరాజు,కొమరం అంద్రయ్య, వి. ప్రేమనందం,s. బర్నాబాస్, జీ.ప్రసాద్, D.లక్ష్మయ్య, n.కొమరయ్య, g.సురేష్, l.శ్రీను, k.బాబు తెరాస మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,జి ల్లా నాయకులు వాత్సవాయి శ్రీధర్ వర్మ, పిఎసియస్ చైర్మన్ తోట రమేష్, జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,పోరిక గోవింద్ నాయక్, తాహిర్ పాషా,దళిత సేవ సమితి జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,

మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ , మండల ప్రధాన కార్యదర్శి గుండేటి  రాజు యాదవ్,వైఎస్ చైర్మన్ కడబోయిన నరేందర్,పిఎసియస్ డైరెక్టర్లు, నర్రా శ్రీధర్  సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,అచ్చ సత్యనారాయణ నర్సయ్య,రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి, చిలకమర్రి రాజేందర్ ,చిట్టిమల్ల సమ్మయ్య, మహిళ అధ్యక్షురాలు కాటూరి సుగుణ,నూనె లింగయ్య పాల్గొన్నారు. ఏటూరు నాగారం బ్లడ్ బ్యాంక్ ఇంచార్జి k.మురళి, Dr. స్వాతి, నర్సులు ch. మల్లిక, వి.వెంకటరమణ, అరుణ్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్న బైరామల్ గూడా వాసులు

Satyam NEWS

కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని భగ్నం చేసే యత్నం

Satyam NEWS

హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి సమస్యలపై వైద్య విధాన పరిషత్ కు వినతి

Satyam NEWS

Leave a Comment