26.7 C
Hyderabad
April 27, 2024 08: 55 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

#hujurnagar congress

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని  పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో ఆదివారం   జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు జాతీయ జెండా ఎగురవేశారు. పాల్గొన్న నాయకులందరూ జాతీయ గీతాన్ని ఆలపించి,దేశ స్వాతంత్ర్యం కొరకు అహర్నిశలు శ్రమించి, ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను గుర్తు చేసుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని అంతమొందించి వారిని పారత్రోలటాని భారతదేశ స్వాతంత్ర్య సిద్ధి కొరకు అలుపెరుగని సత్యాగ్రహ ఉద్యమ స్ఫూర్తితో ఎందరెందరో మహానుభావులు దేశ భక్తితో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్దించిందని,వారి త్యాగాలను భావితరాలు మరువరాదని అన్నారు.అనంతరం మిఠాయిలు పంచుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,రాష్ట్ర,జిల్లా,బ్లాకు, మండల కమిటీలు,కౌన్సిలర్స్,వార్డులలో పార్టీ తరపున కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు,బూతు అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నిత్యావసరాలు పంచిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్

Satyam NEWS

తెలంగాణ LAWCET పరీక్ష తేదీ మార్చాలి

Satyam NEWS

ఒంగోలు వ్యాపారులకు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment