వనపర్తిలోని 33వ వార్డులోని షమా బేగం భర్త అబ్దుల్ గఫార్ కు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న తర్వాత ఆర్థిక సాయం కోసం వార్డు కౌన్సిలర్ ద్వారా మంత్రిని కోరగా స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందజేశారు.
వార్డులోని నిరుపేదలకు ఆర్థిక అండగా నిలుస్తున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి రుణపడి ఉంటామని వార్డు ప్రజల తరఫున కౌన్సిలర్ ఉంగలం అలేఖ్య తిరుమల్, టిఆర్ఎస్ నేత ఉంగలం తిరుమల్ కృతజ్ఞతలు తెలిపారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్