38.2 C
Hyderabad
April 29, 2024 12: 07 PM
Slider సంపాదకీయం

ఎపీ ప్రభుత్వంపై మెగాస్టార్ హాట్ కామెంట్స్ వెనుక ఆంతర్యం?

#megastar

ఎపీ ప్రభుత్వంపై మెగాస్టార్ హాట్ కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి? మెగా స్టార్ చిరంజీవి లో ఎందుకీ మార్పు?. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తున్నా కూడా ఎప్పుడూ స్పందించని చిరంజీవి ఇప్పుడు పేరు పెట్టకపోయినా జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది కూడా భోళా శంకర్ సినిమా విడుదలకు ముందు అయన ఈ మాటలు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికార వైసీపీ నేతలు, మంత్రులు.. ముఖ్యంగా సాగునీటి శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రో పై పెద్ద ఎత్తున ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన డ్యాన్స్ కు స్పూఫ్ పెట్టారనే కారణంగా అంబటి రాంబాబు ఏకంగా ఈసినిమాకు నిధులు విదేశాల నుంచి ఆక్రమమార్గంలో వచ్చాయని..దీనిపై ఫిర్యాదు చేస్తున్నానని చెప్పటమే కాకుండా..ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అదే సమయంలో అసలు పవన్ కళ్యాణ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు…వంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో వాల్తేర్ వీరయ్య సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజుల పూర్తి చేసుకున్న సాదరంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడే చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అని చురకలు వేశారు. డిమాండ్ ఉన్న వారికీ రెమ్యూనరేషన్స్ ఎక్కువే ఇస్తారని అన్నారు. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం అంటే ఇది నేరుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలే అని చెప్పొచ్చు.

హైదరాబాద్ లో ఇటీవల జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొంత మంది అందరూ ప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగటం ఇప్పుడు కీలకంగా మారింది. చిరంజీవి తాజా వ్యాఖ్యలు చూస్తే వచ్చే ఎన్నికల్లో నేరుగా పవన్ కళ్యాణ్ జనసేన కోసం అయన కూడా బరిలోకి దిగుతారా అనే చర్చ కూడా ప్రారంభం అయింది. ఎన్నికల నాటికీ చిరు జనసేన కు మద్దతుగా వస్తారు అని గతంలో ఆ పార్టీ రాజకీయ వ్యవరాహల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి చిరు తాజా వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Related posts

బెంగాల్ ప్రజలకు అక్క కాదు… మేనల్లుడికి అత్త మాత్రమే

Satyam NEWS

బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన

Sub Editor

కాంగ్రెస్ నవ’యువ’ సంకల్పం

Satyam NEWS

Leave a Comment