26.7 C
Hyderabad
April 27, 2024 07: 36 AM
Slider జాతీయం

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

#modinew

ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది.
పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్‌ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరి క్వింటాలుకు రూ.143 చొప్పున, మూంగ్ దాల్ క్వింటాలుకు రూ.803 చొప్పున, రాగులు క్వింటాలుకు రూ.268 చొప్పున పెంచారు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచినట్లు తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు, రైతులకు సరసమైన ధర లభించేలా చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీస మద్దతు ధర అధికంగా పెంచినట్టు పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో ఎంఎస్‌పీ పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,040 నుంచి రూ.2,183కు పెంచినట్లు తెలిపారు. పెసర పప్పు ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు. మణిపూర్ హింసాకాండ, బాలాసోర్ రైలు దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారికి మంత్రివర్గం సంతాపం తెలిపిందని గోయల్ తెలిపారు. హుడా సిటీ సెంటర్‌ నుంచి గురుగ్రామ్‌లోని సైబర్‌ సిటీకి మెట్రో అనుసంధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 28.50 కి.మీల మేర 27 స్టేషన్ల మీదుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. మంజూరైన తేదీ నుంచి నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5452 కోట్లు.

రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించే ధరను కనీస మద్దతు ధర అంటారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఖరీఫ్ (యాసంగి) పంటలను కోసిన తర్వాత అక్టోబరు నుంచి రబీ (శీతాకాలం) పంట కాలం ప్రారంభమవుతుంది. గోధుమలు, ఆవాలు ప్రధాన రబీ పంటలు.

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎంఎస్‌పీ ధరలు

సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. దీనిని 2023-24 కోసం రూ.2,183కు పెంచారు. అంటే రూ.143 పెంచారు.

గ్రేడ్ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు.

హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు.

రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది.

వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకుముందు ఇది రూ.5,850 ఉండేది.

Related posts

దళిత బంధు కోసం పాకులాడటం మంచిది కాదు

Satyam NEWS

లండన్ లోని థీమ్స్ నదిలా మురికి మూసీ

Satyam NEWS

సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవార్చుకోవాలి

Satyam NEWS

Leave a Comment