మాజీ సీఎం ,టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో ఆ పార్టీనేత పట్టాభి మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స..ఆ వ్యాఖ్యలు చేయించింది…బాబుకాదా అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.
జరిగిన దాడి ,గొడవలపై ఎవరు చేయించారో పోలీసుల విచారణలో తేలుతుందన్నారు.ఈ విషయంపైనే మంత్రి బొత్స …బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటికి అన్నం తింటున్నావా..? అశుద్ధం తింటున్నావా అంటూ మంత్రి బొత్స ధ్వజమెత్తారు.ఈ మేరకు విజయనగరం జిల్లాకేంద్రంలో ఆ పార్టీ నేతలు ప్రకాష్ సిల్క్ పేలస్ వద్ద బాబు,పట్టాభిల దిష్టబొమ్మను దగ్ధం చేసారు.
ఈ సందర్బంగా మంత్రి బొత్స ….తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు పై పైర్ అయ్యారు. అసలు దాడులు చేయించిందెవరని…ఆపైగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కోరడం సిగ్గు చేటన్నారు. పైగా దాడులను నిరసిస్తూ..బంద్ తలపెట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపు నివ్వడమేంటని మంత్రి బొ్త్స ప్రశ్నించారు.
ఈ దిష్టిబొమ్మదగ్ఢం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి,ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ,ఎంఎల్సీ సూర్యనారాయణరావు, వీఎంసీ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీచైర్మన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.