మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలో జరుగుతున్న వీరుల తిరుణాళ్లు, పల్నాడు ఉత్సవాలలో నేడు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాల్గొన్నారు. నేడు కారంపూడి పట్టణంలో కోడిపోరు నిర్వాహణ కార్యక్రమం జరుగుతున్నది. వేలాది మంది పల్నాడు ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.
వైభవంగా జరుగుతున్న ఈ వీరుల తిరుణాళ్లలో ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఆర్.డి.ఒ గురజాల పార్థసారథి తదితరులు కూడా పాల్గొన్నారు. పల్నాడు ప్రాంత విశిష్టతను తెలియచేస్తున్న ఈ వీరుల తిరుణాళ్లు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.