38.2 C
Hyderabad
April 27, 2024 15: 27 PM
Slider సినిమా

రైటర్ పద్మభూషన్ లిరికల్ సాంగు రిలీజ్

#writerpadmabhushan

సుహాస్ హీరోగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా రూపొందింది. చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. ఫస్టు పోస్టర్ నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. సుహాస్ జోడీగా ఈ సినిమాతో టీనా శిల్పరాజ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. ‘అయ్యబాబోయ్ గందరగోళం .. మా వాడేమో తింగరమేళం’ అంటూ ఈ పాట మొదలవుతోంది. కల్యాణ్ నాయక్ కంపోజ్ చేసిన ఈ పాటకి కోటి మామిడాల సాహిత్యాన్ని అందించాడు. లక్ష్మి మేఘన బృందం ఆలపించారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఆషిశ్ విద్యార్థి .. రోహిణి కనిపించనున్నారు. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా హిట్ కొట్టిన సుహాస్ , ఈ సినిమాతో కూడా హిట్ పడతాడేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో లక్ష్మీ కాసులహారం ఊరేగింపు

Satyam NEWS

లిక్కర్ మఠాష్: గుడుంబా స్థావరాలపై దాడులు

Satyam NEWS

మెడికల్ నెగ్లిజెన్స్: సిఎం ఇలాకాలో గర్భిణి మృతి

Satyam NEWS

Leave a Comment