పర్యాటకాభివృద్ధి కోసం భారత్ సహా 48 దేశాలకు అందించిన ‘ఫ్రీ-వీసా’ పథకం గడువును ఏప్రిల్ 30 వరకు పొడించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019లో ఈస్టర్ సండే రోజున జరిగిన ఉగ్రదాడుల అనంతరం పర్యాటకాభివృద్ధి కోసం ఫ్రీ వీసా పథకాన్ని శ్రీలంక తీసుకొచ్చింది.
ప్రస్తుతం కొవిడ్ వైరస్ విజృంభణ ప్రభావం అంతర్జాతీయ ప్రయాణాలపై తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ పథకాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించింది.