అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి పలు గ్రామాలు ముంపుకు గురై సర్వం కోల్పోయి నిర్వాసితులుగా ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని టిడిపి నేత గంటి నరహరి తెలిపారు. శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించి అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. అని రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ప్రభుత్వం బాధితులకు పక్క గృహాలు నిర్మించలేదన్నారు.
అంతను ఆ ప్రాంతాలను తిరిగి పరిశీలించి,సమస్యలు తెలుసుకొని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే టిడిపి ప్రభుత్వంలో పేదలకు ఆకలి తీర్చే అన్నక్యాంటీన్ గొప్ప కార్యక్రమాన్ని తిరిగి 6 మండలాల్లో నిర్వహిస్తామని, మొదటగా రాజంపేట పట్టణంలో త్వరలోనే ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాజంపేట రూరల్ అధ్యక్షుడు సుబ్బ నరసయ్య, సుండుపల్లె మండల అధ్యక్షుడు రెడ్డప్ప, పార్లమెంట్ కార్యదర్శి నాగమునిరెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు భగవాన్ సహాయ రెడ్డి,ఒంటిమిట్ట మండలం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, తదితరులు పాల్గొన్నారు.