36.2 C
Hyderabad
April 27, 2024 21: 41 PM
Slider ఖమ్మం

ముఖ్యమంత్రిని కలిసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ

#CMKCR

తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం అందుకున్నారు.

మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి దంపతులను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ప్రభుత్వపరంగా అందిస్తున్నసహాయ, సహకారాలతో బాధ్యత నిర్వహణను విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి మార్గ నిర్దేశంలో ప్రజా మన్ననలు పొందే స్ఫూర్తితో తాను పని చేస్తున్నట్లు చెప్పారు.

తాను బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది అయిందని, ఈ కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే కాక టి.ఎస్.ఆర్టీసీ, రవాణా శాఖ అభ్యున్నతి కోసం కృషి చేసినట్లు తెలిపారు.

Related posts

రెండో అధికార భాష గా ఉర్ధూ

Sub Editor 2

జోధ్ పూర్ లో కర్ఫ్యూ: విస్తరించిన అల్లర్లు

Satyam NEWS

50 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment