సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన సిఎం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని న కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీ లకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని తెలిపారు.
ఇక సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. సూర్యాపేటకు కళాభారతి కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని.. రూ.25కోట్లతో కళాభారతిని మంజూరు చేస్తున్నా అని ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుకు దీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు. సూర్యాపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా చూస్తే వందలాది కొత్త బిల్డింగ్లు వచ్చినయ్ అన్నారు .
సూర్యాపేట అభివృద్ధిని కళ్ళా రా చూడాలని మొత్తం నాలుగు మూలలు తిరిగిన అన్న సిఎం ,అభివృద్ధిలో సూర్యాపేట దూసుకెళ్తున్నది అన్నారు. సూర్యాపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలని.. కొత్త రోడ్లు కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ కావాలని కూడా మంత్రి అడిగారని.. దాన్ని కూడా మంజూరు చేస్తామన్నారు.
స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు కూడా వెంటనే జీవో రిలీజ్ చేస్తామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి అడిగినట్లు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచించారు.