ఢిల్లీలో పేలుడు సంభవించింది. రోహిణి కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగన పోలీసులు ల్యాప్టాప్ బ్యాటరీ పేలినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు.
కోర్టు రూమ్ నంబర్ 102లో స్కూల్ బ్యాగ్లో ఉంచిన ల్యాప్టాప్ పేలింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించింది. ల్యాప్టాప్ నేలపై పడి ఉన్న వీడియోలు, పోలీసు సిబ్బంది చుట్టూ తిరుగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ల్యాప్టాప్ బ్యాటరీలో టెక్నికల్ సమస్యల వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేసి.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.