రెండు రోజుల కిందట మిస్సింగ్ అయిన ఒక యువతి నేడు శవమై కనిపించింది. అనంతపురం లో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడి 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక మరాఠీ కుటుంబం నివశిస్తున్నది.
ఆ కుటుంబంలోని రాజేశ్వరి రెండురోజుల క్రితం పూల కోసం ఇంటి నుంచి బయటకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదు.
ఈ మేరకు 3 వ పట్టణ పోలీస్ లు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నేడు బస్ స్టాండ్ సమీపం లోని ఇడ్లి అండ్ మోర్ హోటల్ ఎదురుగా ఉన్న షాప్ ల వెనుక వైపు రాజేశ్వరి శవం కనిపించింది.
రాజేశ్వరి ని ఎవరైనా హత్య చేశారా లేక రాజేశ్వరి ఆత్మహత్య కి పాల్పడిందా అనే కోణం లో పోలీస్ ల విచారణ కొనసాగుతున్నది.
పోస్టు మార్టం కోసం రాజేశ్వరి మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ కి తరలించారు.