38.2 C
Hyderabad
April 28, 2024 20: 19 PM
Slider అనంతపురం

మిస్ అయిన యువతి నేడు శవమై కనిపించింది

#AnanthapurPolice

రెండు రోజుల కిందట మిస్సింగ్ అయిన ఒక యువతి నేడు శవమై కనిపించింది. అనంతపురం లో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడి 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక మరాఠీ కుటుంబం నివశిస్తున్నది.

ఆ కుటుంబంలోని రాజేశ్వరి రెండురోజుల క్రితం పూల కోసం ఇంటి నుంచి  బయటకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదు.

ఈ మేరకు 3 వ పట్టణ పోలీస్ లు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నేడు బస్ స్టాండ్ సమీపం లోని ఇడ్లి అండ్ మోర్ హోటల్ ఎదురుగా ఉన్న షాప్ ల వెనుక వైపు రాజేశ్వరి శవం కనిపించింది.

రాజేశ్వరి ని ఎవరైనా హత్య చేశారా లేక రాజేశ్వరి ఆత్మహత్య కి పాల్పడిందా అనే కోణం లో పోలీస్ ల విచారణ కొనసాగుతున్నది.

పోస్టు మార్టం కోసం రాజేశ్వరి మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ కి తరలించారు.

Related posts

రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

Satyam NEWS

బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS

ద్వారకా తిరుమల గోపురానికి బంగారు తాపడం

Satyam NEWS

Leave a Comment