దక్షిణాది తొలి ప్రధాన మంత్రి గా వెలుగొంది
ఎన్నో అపవాదులు,కష్టాలు ఎదుర్కొని
నిజం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ
వందేమాతరం గేయాన్ని ప్రతిధ్వనింప జేస్తూ
స్వతంత్రోద్యమంలో ధైర్యంగా
వేల చెవులు వింటున్న,లక్షల పదాలు నడుస్తున్న
మీ ఒక్క ముందడుగు తో ప్రజలను ముందుకు నడిపిస్తూ
జనం ఆటంకం అన్న పరుల మాటకి
జనమే బలం అని ముందుకి సాగుతూ
ఒక్క సంతకం తో కూలిని పట్టాదారు ని చేసి
బహుభాషా లలో ప్రావీణ్యం చూపి
దేశ ఆర్ధిక,రాజకీయ వ్యవస్థకు ప్రాణం పోసి
దేశ శిరస్సు పై కిరీటాన్ని పదిలంగా నిలబెట్టి
ప్రపంచ పద్మ వ్యూహాన్ని ఛేదించి
కాలాన్ని అధిగమించిన విరుడయ్యారు
ఇన్సైడర్ గా వెలుగొందారు
సాహిత్య కృషికి గుర్తింపుగా
సాహిత్య అకాడమీ పురస్కారం పొంది
ఆర్ధిక సంస్కరణ పితామహుడు గా
వెలుగొందిన పివి.నరసింహ రావు గారికి వందనం
మీ సేవలకు అభివందనం
టి.సంయుక్తాకృష్ణమూర్తి, కరీమబాద్, వరంగల్