30.7 C
Hyderabad
April 29, 2024 03: 06 AM
Slider మహబూబ్ నగర్

What a Joke: ముచ్చటగా మూడో సారి…!

#MLA Camp Office

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముచ్చటగా మూడోసారి ప్రారంభోత్సవం చేయడంపై పలువురు పలు విధాలుగా  మాట్లాడు కోవడమే గాక సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు.

పరిపాలన సౌలభ్యం కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను  ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే ప్రారంభోత్సవాలు చేసుకోవాలని 2018లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పట్లో సూచించారని, 5 సెప్టెంబర్ 2018 న అప్పటి  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి  ప్రారంభోత్సవం చేశారు.

తదుపరి 10 జూన్ 2020 న ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు.  బుధవారం 8 జూలై 2020 న ముచ్చటగా మూడోసారి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరిని ఎవరు అవమానించడానికి ఇలా చేశారని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రారంభోత్సవాన్ని అవమానించడానికి చేశారని అనుకోవడానికి మరి అధికార పార్టీ మంత్రి నిన్న ప్రారంభోత్సవం ద్వారా ఎవరు ఎవరిని అవమాన పరచాలని ఉద్దేశంతో ఇలా చేశారని పలువురు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు.

మరికొందరు ఈ హంగులు ఆర్భాటాలు ప్రజలను మభ్యపెట్టడానికే నని , అధికార పార్టీకి ఎలాంటి పనులు లేక ప్రారంభించిన కార్యాలయాల నే మళ్లీ మళ్లీ  ప్రారంభిస్తున్నారని,  హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తు సోషల్ మీడియాలో  వీడియోలు పెడుతున్నారు.

ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజాధనాన్ని వెచ్చించి క్యాంపు కార్యాలయాలు నిర్మించినప్పటికీ రాజకీయ కుళ్లు, కుట్రలు కంటికి కనపడుతున్నాయని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ప్రజా ప్రతినిధులు ఓటు వేసి ఎన్నుకున్న ప్రజలకు నమ్మకద్రోహం చేయకుండా అందుబాటులో ఉండి ప్రతి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించి ప్రజల కష్టాలు తీర్చాలిసిందిగా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts

డిజాస్టర్: విషవాయువుతో పసి పిల్లలు విలవిల

Satyam NEWS

కాన్పూర్ హింసలో కొత్త ట్విస్ట్: పాకిస్తాన్ ప్రేరేపిత చర్యగా నిర్ధారణ

Satyam NEWS

మున్నూరు కాపు సంఘం 7వ రోజు అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment