ఆరోగ్యానికి సంబంధించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని హైదరాబాద్ జుబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెంగళరావునగర్ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు ఆయన నేడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
చెక్కులు అందుకున్నవారిలో వి. సత్యనారాయణ గౌడ్ (రు.20000), సిమరన్జిత్ సింగ్ (రు.38000), నంద కిషోర్(రు.12500) విలువైన సి.ఎం.రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దేదీప్య, ప్రధాన కార్యదర్శి ఎస్.వేణు, ఎక్స్ కార్పొరేటర్ శ్యామ్రావు, వేణుగోపాల్ యాదవ్, విజయ్ ముదిరాజ్, కె.నరసిమహ, అజ్జు సింగ్, చందర్ గౌడ్,
సురేష్ ముదిరాజ్, పవన్ ముదిరాజ్, రాములు ముదిరాజ్, సత్యనారాయణ, బాలు రజక, లక్ష్మీగౌడ్, వెంకటరమణ, వాణి,జుబేర్, చందు, బంటి యాదవ్, ఆదిత్య, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.