సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి,శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ పాలక సభ్యులు శనివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి నిసన్మానించారు.
అనంతరం సైదిరెడ్డి తో దేవాలయం వద్ద జరగవలసిన అభివృద్ధి గురించి వివరించి,ఈ నెల 30వ, తేదీన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో జరిగే కృష్ణాష్టమి కి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ జగన్నాథచార్యులు,ఈవో గుజ్జుల కొండారెడ్డి,ధర్మకర్తలు రామిశెట్టి రాము, కోలపాటి వెంకటేశ్వర్లు,వెన్న పద్మ,దోసపాపి నరసింహమూర్తి,ఆలయ అర్చకులు నరసింహాచార్యులు,స్థానచారి దామోదరా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్