ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల పలు జలపాతాల వద్ద జరిగిన ప్రమాదాల్లో పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఖండాల ఘాట్ కు సైతం పర్యాటకుల రద్దీ పెరిగింది. దీంతో ఖండాల ఘాట్ తో పాటు జలపాతం వద్ద ఏలాంటి దర్ఘటనలు చోటు చేసుకోకుండా ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఖండాల జలపాతం ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అటు జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జలపాతం వద్ద మెట్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేపడతమని తెలిపారు. అనంతరం పరిసర గ్రామాల్లో పర్యటించి వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నరు. ఎమ్మెల్యే వెంట రైతు బంధు సమితి అధ్యక్షులు అడ్డి బోజా రెడ్డి, మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మండల వైస్ ఎంపీపీ గండ్రత్ రమేష్, టిఆర్ఎస్ నాయకులు అరె నరేష్, నారాయణ తదితరులు ఉన్నారు.
previous post