30.7 C
Hyderabad
April 29, 2024 06: 28 AM
Slider కడప

చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే మేడా కు లేదు

#sammetasivaprasad

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర స్ఫూర్తి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ని విమర్శించే అర్హత రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డికి లేదని తెదేపా రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సమ్మెట శివప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా నందలూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మేడాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీనేని విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పదవులను అనుభవించి స్వార్థం కోసం వైసీపీలో చేరారన్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్లు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని స్వార్థం కోసం వదిలిపెట్టి గంజాయి వనమని మాట్లాడడం నీచ సంస్కృతికి అడ్డం పడుతుందన్నారు. 8 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ సొంత ఊరికి రోడ్డు వేసుకోలేని దౌర్భాగ్యంలో ఉన్నారని పదవులన్నీ ఆయన కుటుంబంలోనే అనుభవిస్తున్నారని అన్నారు. రాజంపేటలో ఆయన, నందలూరులో ఆయన చిన్నాయన ఇసుక మాఫియా లో రాష్ట్రంలో ఉండే మాఫియా నాయకులతో పోటీపడుతున్నారని చంద్రబాబు అనడంలో తప్పేముందున్నారు.

ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గం ప్రజల బాగోగులు చూసుకోవాల్సింది పోయి, ఆదాయం కోసం ప్రకృతి వనరులను ఇస్టారాజ్యంగా తవ్వేస్తున్నారన్నారు. ఇసుక మాఫియాకు ట్రాక్టర్లు, టిప్పర్లు, బుల్డోజర్లు, ఎస్కవేటర్లు వరదల్లో కొట్టుకుపోతాయని డ్యాం గేట్లు ఎత్తనీయకుండా ఆపివేయించి  అతి భయంకరమైన, గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ దుర్ఘటన జరగడానికి ఎమ్మెల్యేనే కారకులని దీనికి బాధ్యత ఆయనే వహించాలన్నారు.

ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని, ఆస్తులతో పాటు పంటలను, పశువులను కోల్పోయారన్నారు. మచ్చలేని నాయకుడిగా, ఒక విజనరీ నాయకుడిగా, భావితరాల ఆశాకిరణంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ని విమర్శించే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలని హితవు పలికారు.

Related posts

ప్రపంచానికి శుభవార్త: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

Satyam NEWS

కరోనా రోగుల కోసం ఆక్సిజన్ కాన్సన్ అందజేసిన జనసేన

Satyam NEWS

7 Ways To Buy Litecoin Cryptocurrency In 2022 Low Fees Where & How To Buy Litecoin

Bhavani

Leave a Comment