పని చేయని ప్రభుత్వ ఉద్యోగులను తీసివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. పని చేయకుండా జీతం తీసుకుంటున్న వారిని గుర్తించి వారిని బలవంతంగా ఉద్యోగాల నుంచి తీసేసేందుకు ఈ చట్ట సవరణ వీలు కలిగిస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సివిల్ సర్వెంట్స్ (డైరెక్టరీ రిటైర్ మెంట్ సర్వీస్ ) రూల్స్ 2020 చట్టం తీసుకువచ్చారు.
ప్రభుత్వంలోని ఒకటి నుంచి 19వ గ్రేడ్ ఉద్యోగుల వరకూ ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం పదవీ విరమణ వయసుతో పని లేకుండా పని చేయని వారిని రిటైర్ అయినట్లుగా భావించి ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. పాకిస్తాన్ లో ప్రభుత్వ సిబ్బంది రిటైర్ మెంట్ వయసు 60 సంవత్సరాలుగా ఉంది.