ఆత్మహత్యా యత్నం చేసుకున్న బోడ సునీల్ ను ఈ రోజు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.
ఆమెతో బాటు మాజీ కేంద్ర మంత్రి పోరీక బలరాం నాయక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచిన ఇప్పటి ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని లేదు.
ఎలాంటి జాబులు లేవు అని చదువుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులు రోడ్డున పడ్డ దుస్థితి రాష్ట్రం లో నెలకొన్నదని సీతక్క తీవ్రంగా విమర్శించారు.
అసెంబ్లీ కేవలం ముఖ్యమంత్రిని పొగుడుకోవడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా జరగలేదని ఆమె అన్నారు.
బొడ సునీల్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు.