28.7 C
Hyderabad
April 26, 2024 08: 31 AM
Slider ప్రత్యేకం

బోడ సునీల్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

#seetakka

ఆత్మహత్యా యత్నం చేసుకున్న బోడ సునీల్ ను ఈ రోజు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.

ఆమెతో బాటు మాజీ కేంద్ర మంత్రి పోరీక బలరాం నాయక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచిన ఇప్పటి ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని లేదు.

ఎలాంటి జాబులు లేవు అని చదువుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులు రోడ్డున పడ్డ దుస్థితి రాష్ట్రం లో నెలకొన్నదని సీతక్క తీవ్రంగా విమర్శించారు.

అసెంబ్లీ కేవలం ముఖ్యమంత్రిని పొగుడుకోవడానికి తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా జరగలేదని ఆమె అన్నారు.

బొడ సునీల్ ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు.

Related posts

రాధికా కుమారస్వామి సమర్పణలో ‘లక్కీ స్టార్’గా వస్తున్న పాన్ ఇండియా స్టార్ యష్

Satyam NEWS

మున్సిపల్ కార్మికుల సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

వనపర్తి రూరల్ ఎస్సై బి.నాగన్నను సన్మానించిన జర్నలిస్టులు

Bhavani

Leave a Comment