26.7 C
Hyderabad
April 27, 2024 10: 21 AM
Slider నెల్లూరు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆనం

#AnamRamnarayanaReddy

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తి విజయాన్ని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారం ప్రారంభించారు.

వెంకటగిరి సంస్థాన రాజకుటుంబీకులు, యువ రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర తో కలిసి ఈరోజు ఉదయం 11.16 నిమిషాలకు వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులు తీసుకొని, మొదటి ప్రచార  కరపత్రాన్ని అమ్మవారికి సమర్పించారు.

అమ్మవారి అనుగ్రహంతో వెంకటగిరి పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంతో ఎమ్మెల్యే అనుచరులు, ప్రముఖ సీనియర్ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు, వై ఎస్ ఆర్ సి పి పట్టణ కన్వీనర్ గుమ్మల్లపు ఢిల్లీ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ చిట్టెటి హరికృష్ణ, నక్కా దుర్గాప్రసాద్,

దొంతు బాలకృష్ణ, 18 వార్డు కౌన్సిలర్ యచ్చా విజయలక్ష్మి, 23 వ వార్డు కౌన్సిలర్ ఆటంబాకు శ్రీనివాసులురెడ్డి , వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది సుంకర రాజేష్, వైయస్ రాజారెడ్డి అనుచరుడు మంగళపురి వెంకటేశ్వర్లు, మధురెడ్డి, కొండూరు కోటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వరరావు, గొల్లగుంట మురళికృష్ణ, చిగురుపాటి పవన్,

వెందోటి బాబు, దుంపెల్ల రామకృష్ణ, తుపాకుల వెంకటేశ్వర్లు తదితర నాయకులు, కార్యకర్తలు, వై ఎస్ ఆర్ సి పి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆనం ఆదేశాల మేరకు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు కౌన్సిలర్ లు అందరూ వారివారి వార్డుల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో అదే సమయానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు

Related posts

కాళేశ్వరం ఆలయంలో కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక పూజలు

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లాకు చేరబోతున్న మత్స్యకారులు

Satyam NEWS

మోపిదేవి వచ్చిన జబర్దస్త్ యాక్టర్ చలాకి చంటి

Satyam NEWS

Leave a Comment