హన్మకొండ లో నూతనంగా ప్రారంభించిన ఒమేగా హాస్పటల్ ను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు సందర్శించారు. హాస్పటల్ లో ఉన్న సౌకర్యాలు డాక్టర్ల ను ఎమ్మెల్యే సీతక్క అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేద కుటుంబానికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పటల్ లు మానవత్వం తో ముందుకు రావాలని కోరారు.
ఒమేగా హాస్పటల్ ముఖ్యం గా క్యాన్సర్ కు సంబంధించిన అధునాతనమైన జర్మనీ పరికరాలతో వైద్యం చేస్తున్నదని ఆమె తెలిపారు. హైదరాబాద్ తరహా లో అధునాతన చికిత్స అందించేందుకు కృషి చెయ్యడం సంతోషకరమని ఆమె అన్నారు.
ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ కు ఒక నమ్మకం దైర్యం కలిగించి నీరు పేదలకు కూడా ప్రైవేట్ వైద్యం సులువుగా అందించాలని సి. ఈ. ఓ డాక్టర్ చరంజిత్ రెడ్డి కి సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,జిల్లా నాయకులు మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు.