ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ కు ఎమ్మెల్సీ గా రెండో సారి అవకాశం కల్పించారు.
చిత్తూరు జిల్లా నుంచి దివంగత ఎంపీ దుర్గా ప్రసాద్ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కి స్థానం కల్పించారు.
కర్నూలు జిల్లా నుంచి దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి తనయుడు చల్లా భగీరధ రెడ్డి కి విజయవాడ నుంచి మాజీ కార్పోరేటర్ మహ్మద్ కరీమున్నిసాకు టిక్కెట్లు కేటాయించారు.
అదే విధంగా శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, కడప జిల్లా నుండి సీనియర్ నేత సి. రామచంద్రయ్యను ఎంపిక చేశారు.