హుజురాబాద్ పట్టణంలో టీఆరెస్ పార్టీ కార్యాలయ ఆధునీకరణ పనులను మంగళవారం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జివి రామకృష్ణారావు, పట్టణ తెరాస అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ పరిశీలించారు.
హుజురాబాద్ పట్టణంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు కు చెందిన కాంపౌండ్ లో తెరాస పార్టీ కార్యాలయం మొదటి నుండి నడుస్తోంది.
కాగా కార్యాలయాన్ని ఆధునీకరించే పనులు ఇటీవలే ప్రారంభించారు. పనులను వేగంగా పూర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.