గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నానని ఆయన తెలిపారు. తనకు వళ్లు నొప్పులు, జలుబు వచ్చిందని ఆయన తెలిపారు. భోగి రోజు ఆయన ఎంతో ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. లంబాడా మహిళలను తీసుకువచ్చి అందరితో చేతులు కలిపి మరీ ఆయన డాన్సు వేశారు. ఇలా డాన్సు వేసిన విషయాన్ని వీడియోతో సహా సత్యం న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. భోగి సందర్భంగా ఇలా కరోనా నిబంధనలను ఉల్లంఘించడం శోచనీయమని కూడా సత్యంన్యూస్ పేర్కొన్నది. ప్రతిపక్షాల వారు పది మంది గుమికూడినా కేసులు పెట్టే పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో వైసీపీ కార్యకర్తలు భోగి పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తే మారు మాట్లాడలేదు. సత్తెన పల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మహిళల చేతులు పట్టుకుని మరీ అందరితో కలిసి డాన్సు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు అంబటి రాంబాబుకు కరోనా వచ్చింది. మరి ఆ మహిళల సంగతి ఏమిటో తెలియదు. ఎమ్మెల్యే దృష్టిలో పడాలని నిబంధనలు కూడా అమలు చేయని పోలీసులు ఇప్పుడు ఆ మహిళలను వెతికిపట్టుకుని వారికి కూడా కరోనా టెస్టులు ఉచితంగా చేయించాల్సి ఉంది. మరి సత్తెనపల్లి పోలీసులు ఆ పని చేస్తారో లేదు తెలియదు.
previous post