పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని నిరాశ్రయుల వసతి గృహంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వసతి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు చేగు వెంకటేశ్వర రావు, మహిళా అధ్యక్షురాలు పూనూరి కృష్ణకుమారి మాతృ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
ఆశ్రమంలోని మాతృమూర్తులకు చీరలు, పండ్లు, గ్లూకోన్ డి ప్యాకెట్స్ ను అందచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ చింతా కిరణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ అధ్యక్షులు వెల్లంపల్లి కేశవరావు సహకారంతో పండ్లు గ్లూకోన్ డి అందచేశారు.