ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం లోని వల్లూరు మండలంలో వైసీపీ నేతలే ఈ మట్టి మఫియా నడుపుతున్నారు. ఇంత కాలం గుట్టుగా సాగిన మట్టి మాఫియాలో అధికార పార్టీకి చెందిన వారిలోనే రెండు వర్గాలుగా విడిపోయారు. దాంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
ఎవరో ఫిర్యాదు చేయడంతో నిన్న రాత్రి చెరువులో అక్రమంగా మట్టి హిటాచి యంత్రం సహాయం తో తొలుతున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నా పోలీసులు మరియు రెవెన్యూ యంత్రాంగం. మా దగ్గర లంచాలు తీసుకుంటూనే మా టిప్పర్ లనే పట్టుకుంటారా అంటూ పోలీసులపై మట్టి మాఫియా మండిపడింది.
దాంతో 6 టిప్పర్లు మాత్రమే అదుపులోకి తీసుకొని వచ్చి హిటాచి వాహనాన్ని తీసుకురాకుండా అక్కడే అధికారులు వదిలేశారు. చాలా కాలంగా మట్టి మాఫియా చెరువులోని మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ టిప్పర్లు పట్టించినది మట్టి మాఫియాలో ఒక వర్గం వారని సమాచారం. ఒక వర్గాన్ని తోలనీయకుండా, మరొక వర్గాన్ని మాత్రమే తోలుతున్నారని ఇలా చేయడం జరిగిందని సమాచారం.