సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పాలకవీడు మండలం రెవిన్యూ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో వెట్టి చాకిరి చేస్తున్న వీఆర్ఏల పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారి పోతుందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ 22 నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు.తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ వీఆర్ఏలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకంటించిన విధంగా పే స్కేల్ ఇవ్వాలని,అర్హత కల్గిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని,55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తూ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు.తమ సమస్యలను పరిష్కరించకపోతే వీఆర్ఏ ల జిల్లా నాయకుల పిలుపుతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పుల్లయ్య,మిడతపల్లి రాజు,విజయ,నక్క సైదులు,పెరుమాళ్ళ మట్టయ్య,జానీ,ముత్యం సైదులు,షేక్ హిమాం అలీ,సైదులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్