42.2 C
Hyderabad
April 26, 2024 15: 50 PM
Slider హైదరాబాద్

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బన్నాల

#uppal

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, చిల్కానగర్ డివిజన్ ప్రజలకు ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి &ఉప్పల్ ఎమ్మార్వో కె.గౌతమ్ కుమార్ , కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్  ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం

ఉప్పల్ కలిగిరి వెంకటేశ్వరస్వామిని,  బీరప్పగడ్డ తేనే లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని చల్లని చూపులు తెలంగాణ ప్రజల పై ఎప్పటికీ ఉండాలని, అందరూ సుఖ, సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు.  అనంతరం డివిజన్లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు,  కేసిఆర్  ముఖ్యమంత్రి అయ్యాక అన్ని పండగలు ఘనంగా జరుగుతున్నాయని, దేవాలయాలు బ్రహ్మండంగా అభివృద్ధి అయ్యాయని తెలిపారు. అన్ని మతాలకు , పర్వదినాలకు ప్రాధాన్యత ఇస్తూ లౌకిక స్పూర్తిని కాపాడుతున్నారని చెప్పారు.

కరోనా, ఒమీక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, జనాలు గుమికూడే ప్రదేశాలకు వెళ్లకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో  బాణాల రాంరెడ్డి,రెవెన్యూ అసోసియేషన్  ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ,డివిజన్ ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, మాస శేఖర్,కొల్లూరి సాంబరాజు, బాలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రాజపక్సే పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Satyam NEWS

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

Satyam NEWS

విద్యుత్ వినియోగదారులకు న్యాయం చేయండి

Satyam NEWS

Leave a Comment