నెల్లూరు జిల్లాలో వైసీపీపై మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం వినిపించారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడు చిచ్చు పెడుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని సీఎంకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. పరిశీలకుడు ధనుంజయరెడ్డి నిర్ణయాలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. తన మీద పెత్తనం చేయడానికి కుదరదు… సీఎం, మంత్రి దగ్గర తేల్చుకోవడానికి కాదు దేనికైనా సిద్ధమేనని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.