నిర్మల్ లోని బంగల్ పేట్ కు చెందిన గోదావరి అనే గర్భిణీకి పూరిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనం దొరక్కపోవడంతో గాంధీ చౌక్ వరకు ఆమె కాలినడకన వచ్చింది.
లాక్ డౌన్ బాధితులకు ఆహారాన్ని పంచడానికి అటువైపుగా వెళ్తున్న సహారా యూత్ సభ్యులు పరిస్థితిని చూసి వాహనాలు లేకపోవడం తో అటువైపు వెళ్తున్న నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్కు తెలిపారు. పరిస్థితి వివరించి చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ వెంటనే తన స్వంత కార్ (TS18D4444)లో పేషంట్ ని స్థానిక ప్రసూతి ఆసుపత్రికి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. దాంతో ఆమె, ఆమె బిడ్డ ప్రాణాలు కూడా కాపాడినట్లయింది.