30.7 C
Hyderabad
April 29, 2024 05: 23 AM
Slider ఆధ్యాత్మికం

22న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala-temple

తిరుమల శ్రీవారి ఆల‌యంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని డిసెంబ‌రు 22న‌ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు,

శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఉద‌యం 11.45 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

Related posts

Kerala Assembly Polls: ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఇది

Satyam NEWS

ఖమ్మంలో బంగారం వ్యాపారి నిలువు దోపిడి

Satyam NEWS

వంశీరామ్ బిల్డర్స్ కరోనా విరాళం రూ. కోటి

Satyam NEWS

Leave a Comment