ప్రతీ సోమవారం జరుగుతున్న మాదిరిగానే ఈ వారం కూడా ఏపీలోని విజయనగరం కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం నిర్వహించింది…జిల్లా యంత్రాంగం. కలెక్టర్ సూర్యకుమారీతో పాటు జేసీ మహేష్ కుమార్,డీఆర్ఓ గణపతి రావు, అదే విధంగా జిల్లా విపత్తుల అధికారిణి పద్మావతిలు …యావన్మందీ..బాధితుల నుంచీ ఫిర్యాదులను స్వీకరించారు.అయితే ఈ సారి జరిగినస్పందన కార్యక్రమంలో రెండు విశేషాలు సంతరించుకున్నాయి.ఒకటి..మంత్రి మేకపాటి ఆకస్మికమృతితో జిల్లా యంత్రాంగం స్పందనలోనే సంతాపం తెలియ చేసిన సంగతి తెలిసిందే. దాంతో పాటు మరోసారి స్పందనకు…టీడీపీ నేతలు…ఫిర్యాదుతో వచ్చారు. విజయనగరంలో2018లో పెద్ద చెరువు లో మురుగు నీటిశుద్ది కర్మాగారానికిశంకు స్థాపన చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదంటూ…తక్షణం పనులు ప్రారంభించాలని టీడీపీ నేతలైన…ఐవీపీ రాజు,కనకల మురళీ మోహన్, బొద్దుల నర్సింగరావు సాంస్ర్కతిక విబాగ అధ్యక్షులు విజ్జపు ప్రసాద్ లు కలెక్టర కు వినతి పత్రం ఇచ్చారు. సదరు ప్లాంట్ కు 20 కోట్ల వ్యయంతో ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక విభాగం ద్వారా నిర్మాణము జరగాలని.అలాగే 15 నెలలు అంటే, 2019 లోనే పూర్తి కావలసి ఉండగా ఇప్పటికీ పూర్తికాక అసంపూర్తిగా పడి యుండి పథకం నిర్వీర్యం అవుతోందని సదరు ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు.ఈ పథకం పూర్తయితే…5.0 ఎంఎల్డీ నీరు శుద్ది కాబడి…పెద్ద చెరువు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి.నగర ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనిపేర్కొన్నారు.తక్షణం….సదరు ప్లాంట్ పనులను తక్షణం ప్రారంభించాలని టీడీపీ నేతలు కోరారు.
previous post