అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని రైతులు తెలిపారు. ఇవాళ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి విజయరాయుడుపాలెం వరకు యాత్ర చేయాల్సి ఉంది. అయితే గుర్తింపు కార్డులు చూపితేనే పంపిస్తామంటూ రైతులను పోలీసులు అడ్డగించడంతో.. ఐకాస నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు దాదాపు నాలుగు రోజులు తాత్కాలిక విరామమేనని ఐకాస తెలిపింది.
previous post