కరోనా మహమ్మారి కాటుకు బలైన హోం గార్డ్ బాబా కుటుంబాన్ని వేములవాడ వాట్సాప్ గ్రూపు సభ్యులు పరామర్శించి వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.
బాబా కుటుంబాన్ని పోలీసుశాఖ ఆదుకోవాలని, వీలైతే వారి కుటుంబంలో ఒకరికి పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
బాబా కుటుంబానికి మై వేములవాడ వాట్సాప్ గ్రూపు సభ్యులు అండగా ఉంటారని తెలియజేశారు.
బాబా కుటుంబానికి ఏ. టి.యాదవ్ శభాష్ పల్లి 5000 రూపాయలు, నగుబోతు రవీందర్ 500 రూపాయలు, బుస్స చందు 500 రూపాయలు మిగతా 4000 రూపాయలు మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ సభ్యులు కలిపి మొత్తం పదివేల రూపాయలు బాబా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్ డాక్టర్ బెజ్జంకి రవీందర్ తాటికొండ పవన్ కుమార్, రేగుల రాము, నూగురి మహేష్, మధు మహేష్ , నాగుల చంద్రశేఖర్, రియాజ్ పాల్గొన్నారు.